టైలర్ షాపునకు పోయి వస్తా అని చెప్పి వెళ్లిన బాలిక అదృశ్యం

మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన అడ్వాల రాజేశ్వరి (16) శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామంలోని టైలర్ షాపుకు పోయి వస్తా అని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

Update: 2023-12-23 14:58 GMT

దిశ, జక్రన్ పల్లి : మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన అడ్వాల రాజేశ్వరి (16) శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామంలోని టైలర్ షాపుకు పోయి వస్తా అని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉందని ఆమె తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఆమె గురించి ఏమైనా వివరాలు తెలిస్తే జక్రన్ పల్లి పోలీస్ స్టేషన్ కు (8712659853) సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


Similar News