ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం

మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు ఆటవిడుపుగా స్నానాలు చేసేందుకు దిగి గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది.

Update: 2024-03-08 11:23 GMT

దిశ, బాల్కొండ : మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు ఆటవిడుపుగా స్నానాలు చేసేందుకు దిగి గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు లో ఒకరి శవం లభ్యమైంది. గన్నె తండా సాయినాథ్, లోకేష్, మున్నాలు ప్రాజెక్టు ను సందర్శించి అనంతరం ఎస్సారెస్పీ రిజర్వాయర్ లక్ష్మీకాల్వా హెడ్ రెగ్యులేటర్ ఎగువ భాగాన ఉన్న నీటిలో స్నానాలు చేసేందుకు దిగి గల్లంతయ్యారు. లభించిన శవం సాయినాథ్ గా గుర్తించారు. మిగతా వారి కోసం పోలీస్ శాఖ, రెవెన్యూ, ఎస్ఆర్ఎస్పీ అధికారులు జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు.


Similar News