ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు.

Update: 2024-03-12 11:12 GMT

దిశ, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఈఓ, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చి దిద్దాలని సూచించారు. తాను ఏ క్షణంలోనైనా ఏ పాఠశాలనైనా తనిఖీ చేస్తానని, ఎక్కడ తప్పు కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.


Similar News