ఆరో విడత సాగు నీరు విడుదల

ఆయకట్టు కింద యాసంగి పంట సాగు కోసం ఆరో విడత నీటిని గురువారం విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు.

Update: 2024-03-07 11:47 GMT

దిశ,నిజాంసాగర్ : ఆయకట్టు కింద యాసంగి పంట సాగు కోసం ఆరో విడత నీటిని గురువారం విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్ష 25 వేల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటివరకు ఐదు విడతల్లో 7.8 టీఎంసీల నీటిని విడుదల చేశామని,

    ప్రస్తుతం ఆరో విడత నీటిని విడుదలను ప్రారంభించామన్నారు. ఆయకట్టు పంటలు గట్టెక్కెందుకు ఏడు విడతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైతులు అవసరాలకు నీటి విడుదలలో మార్పులు ఉండవచ్చని అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగులకు గాను 1396.33 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు.  


Similar News