విషపు నీళ్లు తాగి గొర్రెలు మృతి

పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.

Update: 2024-05-13 13:48 GMT

దిశ, కామారెడ్డి : పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ధరణి రాజమల్లు ఎనిమిది గొర్రెలు, తోత్తుల మల్లయ్య కు చెందిన రెండు గొర్రెలు వ్యవసాయ బావి వద్ద పురుగుమందు కలిపిన నీళ్లు సేవించడంతో మృతి చెందినట్లు తెలిపారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 


Similar News