జాతీయ పునర్నిర్మాణమే ఆర్ఎస్ఎస్ శాఖ లక్ష్యం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలోని గిరిరాజా కళాశాల మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాఖ సంఘామంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Update: 2024-03-10 04:41 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలోని గిరిరాజా కళాశాల మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాఖ సంఘామంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ స్థాపించి 98 ఏళ్ళు పూర్తి చేసుకుందని మొదట ఒక శాఖతో ప్రారంభమై నేడు 75 వేలకు పైగ శాఖలు నడుపుతు వ్వక్తి నిర్మాణమే లక్ష్యంగా తద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించవచ్చని, ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా పని చేస్తుందని అన్నారు. జాతీయ భావాలు పెంపొందించడంలో, దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో, కలియుగంలో ధర్మాన్ని రక్షించే ధర్మరక్షకులుగా తయారుచేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రల రూపాలలో విద్యార్థి దశలో ఏబీవీపీ‌గా హిందూ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్‌గా, కులవ్యవస్థ నిర్ములనలో సమరసత వేదికగా, ఇలా 40 వివిధ క్షేత్రల ద్వారా సమాజాన్ని నిర్మాణం కోసం, అన్ని రంగాలలో జాతీయ పునర్నిర్మాణం కోసం, వ్యక్తి లొ మంచి గుణాలు,అలవాటు పెంపొందించే లక్ష్యంతో ఆర్ ఎస్ ఎస్ పని చేస్తుందని, అన్నారు శతబ్ది ఉత్సవాలు దృష్టిలో పెట్టుకొని స్వయం సేవకులందరు మరింత ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాలన్న సంఘ్ పిలుపుతో లక్ష శాఖలే లక్ష్యంగా పెట్టుకున్న వారి సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, చిన్నప్పటినుండే పిల్లల్లో దేశ భక్తి, జాతీయ భావాలు పెంపొందించాలంటే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను సంఘ్ శాఖకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్, పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్,, ఇల్లెందుల మమత ప్రభాకర్, బిజెపి నాయకులు, శివ నూరి భాస్కర్, హరీష్ రెడ్డి, మఠం పవన్, బట్టి గిరి ఆనంద్, చింతకాయ రాజేందర్, పవన్ ముందాడ, పుట్టా వీరేందర్,బట్టు వెంకటేష్ , బీజేపీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


Similar News