అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే

అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, దళిత, గిరిజన, బీసీ తేడా లేకుండా అందరూ బీజేపీ సభ్యులుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-09-06 14:09 GMT

దిశ, కామారెడ్డి : అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, దళిత, గిరిజన, బీసీ తేడా లేకుండా అందరూ బీజేపీ సభ్యులుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీకి సంబంధించిన అన్ని మోర్చాల కార్యశాల నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా యువకులను పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని కోరారు.

    ప్రతి మహిళను కలిసి బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించి సభ్యత్వం తీసుకునేలా చూడాలని కోరారు. మైనారిటీలు బీజేపీ కి మద్దతు పలుకుతున్నారని, వారి దగ్గరకు వెళ్లి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్, శ్రీకాంత్, వివిధ మోర్చా ల అధ్యక్షులు వేణు, బాల్ రాజు, భాస్కర్, నాయకులు వెంకటి, రాజశేఖర్ రెడ్డి, ఆనంద రావు, గంగారెడ్డి, నరేష్, లింగం తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News