రిటైర్మెంట్ ఫంక్షన్ కు డబ్బులు వసూలుకు హుకుం జారీ

ఇంజినీరింగ్ శాఖలో పనిచేసే ఒక ఉన్నత స్థాయి అధికారి మార్చి నెలలో రిటైర్మెంట్ అవుతున్నారు.

Update: 2024-03-05 14:40 GMT

దిశ, కామారెడ్డి : ఇంజినీరింగ్ శాఖలో పనిచేసే ఒక ఉన్నత స్థాయి అధికారి మార్చి నెలలో రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ కు కింది స్థాయి సిబ్బంది నుంచి చందాలు వసూలు చేయడం వివాదస్పదంగా మారింది. ఈ పూర్తి బాధ్యత ను తన ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ అధికారికి అప్పచెప్పాడు. పదవీ విరమణ కి కూడా వేలల్లో డిమాండ్​ చేయడంతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అడిగితే అంత ఇవ్వకపోతే ఒత్తిళ్లకి గురిచేస్తున్నారని వాపోతున్నారు. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ అయితే తామెందుకు డబ్బులు ఇవ్వాలని కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. కాగా జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న అవినీతికి ఇదే దర్పణం. 


Similar News