శివనామస్మరణతో మార్మోగిన నవనాథ సిద్దుల గుట్ట

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల నవనాథ సిద్దులగుట్ట శుక్రవారం శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది.

Update: 2024-03-08 12:06 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల నవనాథ సిద్దులగుట్ట శుక్రవారం శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆయన సతీమణి పైడి రేవతి రెడ్డి, కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. సిద్దుల గుట్టపై అన్య మతస్తులు వ్యాపారాలు చేసుకుంటూ హిందువుల నమ్మకాలను వంచించ వద్దన్నారు.

     ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, రాజకీయ జోక్యం చేయొద్దని అన్నారు. చర్చిలు, మసీదుల్లో హిందువులు వచ్చి వ్యాపారాలు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, ఆలూరు మండల అధ్యక్షులు కొట్టురు గిరీష్ గంగాధర్, కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, కలిగోట్ గంగాధర్, యాల్ల రాజ్ కుమార్, ఆకుల శ్రీనివాస్, ఆకుల రాజు, పాన్ శ్రీనివాస్, నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


Similar News