తాండూర్ త్రిలింగరామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్​ ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట మండలం తాండూర్ గ్రామంలో కొలువైన త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

Update: 2024-03-08 10:32 GMT

దిశ, ఎల్లారెడ్డి : మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట మండలం తాండూర్ గ్రామంలో కొలువైన త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని, ఆలయం అభివృద్ధికి గత పాలకులు ఎవరూ కృషి చేయలేరని అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు.


Similar News