భారీగా రేషన్ బియ్యం పట్టివేత

వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్ డిఫల్ట్ రైస్ మిల్లు పై శనివారం అర్ధరాత్రి ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

Update: 2024-03-10 10:09 GMT

దిశ, భీంగల్ : వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్ డిఫల్ట్ రైస్ మిల్లు పై శనివారం అర్ధరాత్రి ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ కల్మశ్వర్ ఆదేశానుసారం ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భారీగా నిల్వ చేసి ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు 120 టన్నుల రేషన్ బియ్యన్ని స్వాధీనం చేసుకొన్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు రైస్ మిల్లును సీజ్ చేసి స్థానిక ఎస్సై వినయ్ కుమార్ కు స్వాధీనం చేశారు.

    స్థానిక పోలీసుల స్వాధీనంలో ఉన్న రైస్ మిల్లుకు ఆదివారం ఉదయం సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఓ ఎస్ డీ శ్రీధర్ రెడ్డి బృందం వచ్చారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని లారీ ల్లో లోడ్ చేయించి మాక్లూర్ లోని సాయి కృష్ణ రైస్ మిల్లుకి స్విఫ్ట్ చేశారు. అక్కడ బియ్యాన్ని కాంటా వేసి అక్కడే కస్టడీ లో ఉంచనున్నట్లు ఓఎస్ డీ తెలిపారు. వజ్రా ఇండస్ట్రీస్ ఓనర్ సాయిక్రిష్ణ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ వెంట సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు జె. వినోద్, శ్రీనివాస్ లు, వీడీఆర్ఐ మహేష్ ఉన్నారు. 


Similar News