శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద

Update: 2024-09-04 12:50 GMT

దిశ, బాల్కొండ : మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద పోటెత్తుతోంది. గోదావరి మహోగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లో 3,05,692 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఎఈఈ వంశీ తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా ప్రాజెక్టు అధికారులు 41 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరి లోకి 3,58,524 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల ప్రజలకు వ్యవసాయ పంటలకు గాని, నివాసాల గాని ముంపునకు గురి కాకుండా ఎప్పటికప్పుడు మిగులు జనాలను విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా కాకతీయ కాలువకు 4000, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 4000, వరద కాలువకు 19000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1089.60 అడుగులు 75.314 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు


Similar News