అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్దం...ఇంతలోనే మృతి

అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్దం చేసుకున్న యువకుడు అంతలోనే మృతి చెందాడు.

Update: 2024-03-05 14:28 GMT

దిశ, ఆర్మూర్ : అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్దం చేసుకున్న యువకుడు అంతలోనే మృతి చెందాడు. ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రవణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ నెల రోజుల క్రితం అమెరికా దేశం నుంచి వచ్చి స్వగ్రామంలో పండుగలు చేసి బంధువులను స్నేహి తులను కలిసి తిరిగి అమెరికా వెళ్దాం అనుకొని అదే పనిలో శ్రావణ్ గౌడ్ బిజీగా ఉన్నాడు. ఇటీవల స్వదేశానికి వచ్చిన శ్రావణ్ గౌడ్ స్నేహితులను కలిసేందుకు ఆర్మూర్ వచ్చి తిరిగి మంథని వెళ్తుండగా సోమవారం

    రాత్రి సరిగ్గా 11.30 గంటల ప్రాంతంలో ఆర్మూర్ నుంచి మంథని కి వెళ్లే మార్గమధ్యలో పిప్రి గ్రామంలో బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ కి శ్రావణ్ గౌడ్ ఢీ కొట్టాడు. ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ కి బైక్ అదుపుతప్పి ఢీకొట్టడంతో బైకు ముందు టైరు ట్రాక్టర్ ట్రాలీ లోనికి వెళ్లడంతో శ్రావణ్ గౌడ్ తల (నొసలి) పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామంలో శ్రావణ్ గౌడ్ ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు అనే విషయం తెలిసి గ్రామంలోని పలువురి మనసును కలిసి వేసింది. ప్రమాద సమయంలో మృతుడితో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు శ్రావణ్ గౌడ్ నెల కింద అమెరికా నుంచి వచ్చి ఈ నెల 12 తేదీన తిరిగి అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో శ్రావణ్ గౌడ్ తిరిగిరాని అనంత లోకాలకు వెళ్లడంపై గ్రామస్తులు జీర్ణించు కోలేక పోతున్నారు.   


Similar News