ఇంటర్మీడియట్ తో చదువు ఆపేయొద్దు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ పర్యటనలో భాగంగా కార్యక్రమాలకు వెళ్తుండగా పరీక్ష రాసి వెళ్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిలతో మాట్లాడారు.

Update: 2024-03-11 09:34 GMT

దిశ, మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గ పర్యటనలో భాగంగా కార్యక్రమాలకు వెళ్తుండగా పరీక్ష రాసి వెళ్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిలతో మాట్లాడారు. పరీక్షలు ఎలా రాస్తున్నారు అని ఏవిధంగా ప్రిపేర్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు.ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా అందరూ బాగా చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, టీచర్లకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఇంటర్మీడియట్ తో చదువు ఆపేయొద్దని పై చదువులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు మీద వెళ్తున్న విద్యార్థులను చూసి కారు ఆపి ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి వచ్చి చదువు ప్రాముఖ్యతను తెలియజేసి, సలహాలు సూచనలు ఇవ్వడం తో విద్యార్థనీలు సంతోషం వ్యక్తం చేశారు.


Similar News