మోదీ పాలనలో ఎయిర్ పోర్ట్ లతో సమానంగా రైల్వేల అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎయిర్ పోర్ట్ లతో సమానంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని, వందే భారత్ వంటి రైలు వల్ల ప్రయాణం కూడా తొందరగా జరుగుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-03-12 11:05 GMT

దిశ, కామారెడ్డి : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎయిర్ పోర్ట్ లతో సమానంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని, వందే భారత్ వంటి రైలు వల్ల ప్రయాణం కూడా తొందరగా జరుగుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. భారతీయ రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా (వన్ రైల్వే స్టేషన్ - వన్ ప్రొడక్ట్) రూ.85 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సందర్భంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం మంచి ఆలోచన అని, ఈ కార్యక్రమం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత రైల్వే వ్యవస్థ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


Similar News