క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి

క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు.

Update: 2023-12-24 12:50 GMT

దిశ, కామారెడ్డి : క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. సోమవారం క్రిస్మస్ పండగను పురస్కరించుకొని కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని ... క్రీస్తు కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన అందరి ఆరాధనలు అందుకుంటున్నారని అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత జీవనం కలిగి ఉండటమే యేసుక్రీస్తు అందరికీ ప్రబోధించారని, దీనిని అనుసరించాలని కలెక్టర్ పాటిల్ కోరారు.


Similar News