క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే

నిజామాబాదు నగరం లోని సీఎస్‌ఐ చర్చిలో అర్బన్ శాసనసభ్యులు దన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అన్ని మతాలను సమానంగా చూస్తుందనీ తెలిపారు.

Update: 2023-12-25 03:29 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాదు నగరం లోని సీఎస్‌ఐ చర్చిలో అర్బన్ శాసనసభ్యులు దన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రిస్టియన్ సోదర, సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అన్ని మతాలను సమానంగా చూస్తుందనీ తెలిపారు. కరోనా, సమయంలో అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టె పథకంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని చెప్పారు. జన్ ధన్ పథకం నుంచి మొదలు పెడితే ఆయుష్మాన్ భారత్ పథకం వరకు ప్రతి పథకం అన్ని వర్గాల ప్రజలకు అందుతుంది అన్నారు. నాతో ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్న మీకు అండగా ఉంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, జన్స్, జోసెఫ్, డేవిడ్, పాల్గొన్నారు.


Similar News