తాగుడు కోసం బైకు దొంగతనాలు

మద్యం తాగడం కోసం.. బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు పంపారు.

Update: 2024-03-05 15:26 GMT

దిశ, భిక్కనూరు : మద్యం తాగడం కోసం.. బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు పంపారు. వివరాల్లోకి వెళితే... భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన కనకరాజు, సిద్దిపేట జిల్లా మిరు దొడ్డికి చెందిన లక్ష్మణులు తాగుడుకు బానిసలై బైకులను ఎత్తుకెళ్తున్నారు. గత నెల 28న

    భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర వైన్స్, రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయం వద్ద నుండి రెండు వాహనాలను, సిద్దిపేట ప్రాంతంలో మరో రెండు బైకులను ఎత్తుకెళ్లారని, వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. వాహనాలను పార్క్ చేసే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ సూచించారు.


Similar News