కేటీఆర్ సాక్షిగా విభేదాలు బట్టబయలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సాగుతున్న కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాసేపు రభస చోటుచేసుకుంది.

Update: 2024-03-10 09:57 GMT

దిశ, కామారెడ్డి : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సాగుతున్న కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాసేపు రభస చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నాయకులు కొమ్ముల తిర్మల్ రెడ్డి వేదికపై మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

     పేరు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. కార్యకర్తలు కొంతమంది వేదికపైకి దూసుకువచ్చి ఆందోళన చేపట్టారు. గంప గోవర్ధన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ కల్పించుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినిపించుకోలేదు. గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించకపోవడాన్ని కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కల్పించుకుని కార్యకర్తలకు సర్ది చెప్పడంతో శాంతించారు.


Similar News