తాగుడుకు బానిసై యువకుడు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అన్నిపల్లి శేఖర్ (36) అనే యువకుడు మద్యానికి బానిసై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఎస్​ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-03-07 15:19 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అన్నిపల్లి శేఖర్ (36) అనే యువకుడు మద్యానికి బానిసై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఎస్​ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఇంట్లో గొడవపడి చనిపోతా అంటూ బయటకు వెళ్లి పోయాడని, తరచూ ఇలాగే చేస్తుండే వాడని తెలిపారు. గురువారం కూడా వెళ్లిపోగా అతని కోసం గాలించగా పట్టణ శివారులోని నవాబ్ వెంచర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పేర్కొన్నారు. 


Similar News