లారీ ఢీకొని వ్యక్తి మృతి
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సారంగాపూర్కు చెందిన రాథోడ్ రామారావు (65) రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టింది ఈ సంఘటనలో రామారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరవ టౌన్ ఎస్సై తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.