దిశ, మద్నూర్ : ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్నూర్ నుండి సిర్పూర్ వెళ్తున్న ఆటో ను లారీ అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లింబూర్ గ్రామానికి చెందిన గౌలే చాందు (30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.