కారును ఢీకొన్న లారీ...ముగ్గురికి గాయాలు
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు లారీలో ఉన్న గొర్రెల మందలో 30 మృతి చెందాయి. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.