రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. 20 రోజుల వ్యవధిలోనే ఐదుగురిపై దాడి..
వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఓ మహిళ గాయాల పాలయింది.

దిశ,భూదాన్ పోచంపల్లి : వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఓ మహిళ గాయాల పాలయింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని గాంధీనగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. మహిళకు తీవ్రంగా రక్తస్రావం జరగడం తో చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల క్రితం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో నలుగురు వ్యక్తులపై దాడి చేశాయి. అది మరచి 20 రోజులు గడవక ముందే మరో ఓ మహిళపై దాడి జరిగింది. వీధి కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.