బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల,

Update: 2024-07-06 16:26 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత, కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఈవో శిరీష, సూర్యాపేట ఆర్టివో వేణుమాధవ్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అందించాలని పేర్కొన్నారు.


Similar News