యాదగిరి కొండపైన మద్యం సీసాలు కలకలం

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన మూత్రవిసర్జన శాల, మరుగుదొడ్లలో మద్యం సీసాలు, నిషేదిత గుట్కా ప్యాకెట్లు, కనిపించాయి.

Update: 2024-07-05 11:12 GMT

దిశ, యాదగిరిగుట్ట : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన మూత్రవిసర్జన శాల, మరుగుదొడ్లలో మద్యం సీసాలు, నిషేదిత గుట్కా ప్యాకెట్లు కలకలం రేపాయి. భక్తులు కొండపైకి వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో భక్తుల వాహనాలను, లగేజీలను చెక్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ నిబంధనం పోలీస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి కొండపైకి వెళ్లే ప్రతి ఒక్క వాహనం ప్రతి ఒక్క భక్తుడి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కొండపైకి అనుమతించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సదరు విషయం పై ఆలయ ఈవో భాస్కర్ రావు ను వివరణ కోరగా వెంటనే వాటిని గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టి,ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశామని తెలిపారు.


Similar News