సాంకేతిక లోపంతో నిలిచిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయింది.
దిశ, మిర్యాలగూడ టౌన్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మిర్యాలగూడ స్టేషన్ వద్దకు రాగానే లగేజీ బోగిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. సుమారు రెండు గంటలకు పైగా రైలును నిలిపివేసి సమస్యను గుర్తించి మరమ్మతు చేశారు. అనంతరం రైలు బయలుదేరి సికింద్రాబాద్ వెళ్లింది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.