Crowd of devotees : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

భక్తుల పాలిట కొంగుబంగారంగా విరజిల్లుతున్న మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Update: 2024-10-27 14:27 GMT

దిశ,కనగల్లు: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరజిల్లుతున్న మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో.. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయం వద్ద అర్చకులు కుంకుమార్చనలు,అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి నైవేద్యంగా భక్తులు మేకపోతులను, బోనాలను సమర్పించి అమ్మవారికి ముడుపులు కట్టారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అధికారులు తగు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News