పంట దెబ్బతిన్న ప్రతీ రైతుకు పరిహారం :ఎమ్మెల్యే

అకాల వర్షాలతో నష్టపోతున్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-10-24 11:24 GMT

దిశ, వేములపల్లి : అకాల వర్షాలతో నష్టపోతున్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లో అకాల వర్షాల కారణంగా.. పంట నష్టం జరిగిన పంట పొలాలని అధికారులతో కలసి పరిశీలించారు. నేలకొరిగిన పంట పొలాలను వీడియో కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవ్వరూ అధైర్య పడద్దని నష్టం జరిగిన ప్రతీ రైతుకి మేము అండగా ఉండి.. తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నారు అంటే ఎక్కడిదాకా నైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతీ ఒక్క రైతు వివరాలు సేకరించి, ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, పిల్లల సందీప్ నాయుడు, ఏవో సైదా నాయక్ తదితరులు ఉన్నారు.


Similar News