అభివృద్ధిని చూసి ఓటేయాలి.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

అభివృద్ధిని చూసి ఓటేయాలని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.

Update: 2023-10-05 13:04 GMT

దిశ, చిలుకూరు: అభివృద్ధిని చూసి ఓటేయాలని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. గురువారం చిలుకూరు రైతు వేదికలో జరిగిన బతుకమ్మ చీరలు, క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పలు పార్టీలు మోసపూరిత వాగ్దానాలు చేస్తుంటాయి.. వాటిని నమ్మి మోసపోవద్దని అన్నారు. మహిళలకు దసరా కానుకగా ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలు, మండలంలోని 17 గ్రామాలకు క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ జానిమియా, ఎంపీడీవో కె. ఈదయ్య, మండల ప్రత్యేకాధికారి రూపేందర్ సింగ్, సర్పంచులు కొడారు వెంకటేశ్వర్లు, ముసి లక్ష్మీనారాయణ, వట్టికూటి చంద్రకళ నాగయ్య, తమ్మనబోయిన శంకర్ రావు, ఎంపీటీసీ బెల్లంకొండ రమణ నాగయ్య, ప్యాక్స్ ఛైర్మన్లు అలసకాని జనార్థన్, బాషం సైదులు, వైస్ చైర్మన్ ఎ. జానకి రామాచారి, రైసస మండల అధ్యక్షుడు దొడ్డా సురేష్ బాబు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నలబోలు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News