నల్లగొండలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్

Update: 2024-09-18 05:09 GMT

దిశ, చింతపల్లి (దేవరకొండ): నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని మైనార్టీ గురుకులంలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మంగళవారం నుంచి విద్యార్థులు మిస్సింగ్‌ కావడంతో వారి కోసం అన్ని ప్రాంతాల్లో వెతుకుతున్నారు. ఇక ఈ అంశంపై గురుకుల పాఠశాల నిర్వాహకులు నిన్న సాయంత్రం 6 గంటలకు  పోలీసులకు ఫిర్యాదు చేసి విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించారు. మిస్సింగ్‌ అయిన ముగ్గురు విద్యార్థులు.. తౌఫిక్ ఉమర్, అబ్దుల్ రెహమాన్, ముజీబ్‌లు పదవ తరగతి చదువుతున్నారని సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Similar News