ఆ పరిశ్రమకు తగిన ప్రోత్సాహం ఇస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు హామీ

ఫిబ్రవరి 26, 28వ తేదీల మధ్య అంతర్జాతీయ బయో ఏషియా సదస్సు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Update: 2024-01-12 12:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 26, 28వ తేదీల మధ్య అంతర్జాతీయ బయో ఏషియా సదస్సు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగంలో పరిశోధనలకు వేదికగా సదస్సు జరుగనుంది. ముఖ్యంగా అంకుర పరిశ్రమకు తగిన ప్రోత్సాహం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు పీసీసీ మాజీ అధ్యక్షుడు, దివంగత పీ.జనార్థన్ రెడ్డి 76వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ కూడలిలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రజలకు పీజేఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు.

Tags:    

Similar News