గవర్నర్‌తో కలిసి వరంగల్‌లోని ఫేమస్ టెంపుల్స్‌ను సందర్శించిన మంత్రి పొన్నం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు వరంగల్‌‌కు చేరుకున్నారు.

Update: 2024-08-28 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు వరంగల్‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ను దేవ్ వర్మ అండ్ మంత్రి సీతక్కతో కలిసి హనుమకొండలోని వెయ్యి స్థంబాల గుడిని సందర్శించారు. వెయ్యి స్థంబాల గుడిలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యి స్థంబాల గుడిలో డాక్యుమెంటరీ వీక్షించి.. తర్వాత భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఖిలా వరంగల్ కోటను సందర్శించి కాకతీయుల చరిత్రను తెలుసుకున్న గవర్నర్ ఖిలా వరంగల్ లో కాకతీయ కీర్తి తోరణం వద్ద పేరిణి నృత్యం, రాణి రుద్రమ నాటకాన్ని వీక్షించారు. వరంగల్‌లో పర్యటించిన ఫొటోలను మంత్రి పొన్నం ట్విట్టర్ వేదికన పంచుకున్నారు.

Click Here For Twitter Link


Similar News