కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు.. కేటీఆర్కు సంచలన వార్నింగ్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వయంగా కేటీఆరే సోషల్ మీడియాలో తమపై పిచ్చిరాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు. పదవీకాంక్షతో కేసీఆర్(KCR)ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతోందని కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ సీఎం అనుకుని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారు.. ఆ నిర్ణయాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షం(opposition)లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. అవి బయటకు రాకుండా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో పిచ్చి పట్టి.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని సురేఖ ఎద్దేవా చేశారు. కాగా, అక్కినేని కుటుంబం, నటి సమంతపై కొండా సురేఖ చేసిన కామెంట్లు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరకు తన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.