Minister Komatireddy: చచ్చిన పార్టీని బతికించడం కోసమే ఈ డ్రామాలు.. మంత్రి కోమటి‌రెడ్డి హాట్ కామెంట్స్

చచ్చిన పార్టీని బతికించడం కోసమే బీఆర్ఎస్ నాయకులు ఈ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-13 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: చచ్చిన పార్టీని బతికించడం కోసమే బీఆర్ఎస్ నాయకులు ఈ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోడని కామెంట్ చేశారు. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చి బీఆర్ఎస్ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తోందని.. అదే ఆ పార్టీ విధానమా అని ప్రశ్నించారు. ఇప్పటికే అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. నిన్నటి ఘటనలో తాము తులుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద, ప్రభుత్వం‌పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలని, అవసరం అయితే రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.        


Similar News