పాల ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడ్డ జనం
నల్గొండ జిల్లాలో ఓ పాల ట్యాంకర్ బోల్తా పడగా.. స్థానికులు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో ఓ పాల ట్యాంకర్ బోల్తా పడగా.. స్థానికులు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. జిల్లాలోని అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై పాలతో వెళ్తున్న మినీ పాల ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. డ్రైవర్ స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా ట్యాంకర్ ను వేగంగా నడపటంతో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. అయితే ట్యాంకర్ నుండి భారీగా పాలు రోడ్డుపాలు కాగా.. స్థానికులు మాత్రం ఆ పాల కోసం ఎగబడ్డారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది.