Harish Rao: ఇది కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు.. హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్

దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-09-20 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సందర్శనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, లక్ష కోట్లు వృథా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెసోళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానమని అన్నారు. అంతేగాక కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే ఇవ్వాళ మల్లన్న సాగర్ లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కాగా శుక్రవారం బీఆర్ఎస్ నేత హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులతో పాటు మల్లన్న సాగర్ ను సందర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.


Similar News