నగర ప్రజలకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు అందుబాటులో మెట్రో సేవలు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందించింది.

Update: 2024-09-15 13:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఈ నెల 17 మంగళవారం రోజు వినాయక నిమజ్జనం (Vinayaka immersion) సందర్భంగా మెట్రో సేవలు(Metro services) రాత్రి 2 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు. రాత్రి 1 గంటలకు చివరి స్టేషన్ నుంచి చివరి రైలు ప్రారంభం అవుతుందని.. అక్కడి నుంచి మరో చివరి స్టేషన్ కు చేరుకునే సరికి 2 గంటల సమయం పడుతుందన్నారు. అలాగే వినాయక నిమజ్జనాలు జరిగే ట్యాంక్ బండ్(Tank bund) సమీపంలోని మెట్రో స్టేషన్ల(Metro services)లో రద్దీని బట్టి సర్వీసులను పెంచడం, సమయంలో మార్పులు చేస్తామని అధికారులు మెట్రో అధికారులు తెలిపారు. వినాయ నిమజ్జనం కారణంగా రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో, ఖైరతాబాద్(Khairatabad), లకిడికపూల్, అసెంబ్లీ, నాంపల్లి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టేషన్ లో అత్యధికంగా రద్దీ ఉంటుంది.


Similar News