తెలంగాణలో వరదలు.. భారీగా విరాళం ప్రకటించిన మేఘా కృష్ణారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో భారీ వరదలు వచ్చాయి.

Update: 2024-09-10 15:12 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో భారీ వరదలు వచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఈ వరదల ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదల కారణంగా వందల సంఖ్యలో సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలు రోడ్డున పడ్డారు. దీంతో చలించిపోయిన ప్రముఖులు వరద బాధితులకు సహాయం చేయడం కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద ఇంజనీరింగ్ సంస్థ అయిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ MD మేఘా కృష్ణారెడ్డి ఈ రోజు భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సహాయంగా వరద బాధితులకు రూ. 5 కోట్లు సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా రెండు రోజుల క్రితం ఏపీ వరద బాధితులకు కూడా మేఘా సంస్థ తరపున ఆయన రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

 


Similar News