కార్యకర్తలకు అండగా ఉంటాం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన

Update: 2024-10-14 13:45 GMT

దిశ, కాప్రా : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు అధిష్టానం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ కు చెందిన తెలంగాణ ఉద్యమ నేత వంశరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు నరసింహ వంశరాజును ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన కార్యకర్తలు విస్మరించకూడదని శాసనసభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నాయకులు మహేష్ గౌడ్, స్వామి, కార్పొరేటర్ పొన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News