అభివృద్ధి పనుల్లో కాలనీవాసుల భాగస్వామ్యం అభినందనీయం.. చైర్మన్ కొండల్ రెడ్డి

అభివృద్ధి పనులలో కాలనీవాసుల భాగస్వామ్యం అభినందనీయమని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-29 11:47 GMT

దిశ, ఘట్కేసర్ : అభివృద్ధి పనులలో కాలనీవాసుల భాగస్వామ్యం అభినందనీయమని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ సాయిగణేష్ నగర్ కాలనీలో కాలనీవాసుల సహకారంతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీని మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ప్రారంభించారు.

దాదాపు 45 మీటర్ల భూగర్భ డ్రైనేజీని రూ.1.20 లక్షలతో నిర్మించినట్లు తెలిపారు. భూగర్భ డ్రైనేజీ అభివృద్ధికి సహకరించిన కాలనీవాసుల్లో వెంకట్ రెడ్డి, నరేష్, ప్రశాంత్, నాగమల్లు, సాయికుమార్, ఆనంద్ లను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, కృష్ణా నాయక్, భారత్, శ్రీను, బుచ్చిరెడ్డి, కరుణాకర్, కొండల్ కాలనీ వాసులు పాల్గొన్నారు.


Similar News