విద్యుత్ షాక్‌తో విద్యార్థి పరిస్థితి విషమం.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని బుద్దా నగర్ పబ్లిక్ పార్క్ వద్ద విద్యుత్ షాక్ కు గురై అనీష్ రాజ్(13) (13) అనే 8వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

Update: 2024-07-14 05:28 GMT

మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని బుద్దా నగర్ పబ్లిక్ పార్క్ వద్ద విద్యుత్ షాక్ కు గురై  అనీష్ రాజ్(13) (13) అనే 8వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం సాయంత్రం ఆటలు అడుటకి బుద్దానగర్ పబ్లిక్ పార్క్‌కి వచ్చిన అనీష్ రాజ్ క్రికెట్ ఆడుతుండగా భద్రతలేని ట్రాన్స్ ఫార్మర్ వద్ద బంతి పడటంతో బంతి తీసే సందర్భంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. గుర్తించిన స్థానికులు హుటాహుటిన స్థానికంగా హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు అనీష్ రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థికి షాపంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్దానగర్ పబ్లిక్ పార్క్ వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కి ఫినిషింగ్ భద్రత లేక పోవడంతోనే ఈ సంఘటన జరిగిందని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News