నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.

Update: 2024-08-14 11:23 GMT

దిశ,ఉప్పల్ : నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. బైక్లు మినిమం 2 గంటల వరకు నిలిపి ఉంచితే 10 రూపాయలు, 8 గంటల వరకు 25 రూపాయలు, 12 గంటల వరకు నిలిపితే రూ. 40 చొప్పున చెల్లించాలి. కారు పార్కింగ్ ధరలు వీటికంటే మూడింతలు

    ఎక్కువగా నిర్ణయించారు. దాంతో మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేటు పెంచి, ఇప్పుడు పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమన్నారు. దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News