కంటోన్మెంట్ లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాం.. జన్యావుల రామకృష్ణ

ప్రజా సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ సభ్యుడు జె.రామక్రిష్ణ అన్నారు.

Update: 2024-09-08 14:16 GMT

దిశ, కంటోన్మెంట్ : ప్రజా సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ సభ్యుడు జె.రామక్రిష్ణ అన్నారు. మీట్ యువర్ మెంబర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రామక్రిష్ణ ప్రియా కాలనిలో పర్యటించారు. స్థానికులు పలు సమస్యలను రామక్రిష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియా కాలనిలో నెలకొన్న సమస్యలకు అతి త్వరలోనే పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ లో జరిగే అభివృద్ధికి సంబంధించిన ప్రతీ పైసా కూడా బోర్డ్ నిధులు , కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు రావడానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, దినేష్, హరిప్రసాద్, నిఖిల్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న రామకృష్ణ..

కాకగూడలో ఆదివారం జరిగిన నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో రామకృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు మన సంస్కృతికి, ధర్మానికి ప్రతీకలని, అవి బాగుంటే మనం బాగుంటామని పేర్కొంటూ ఆలయాలు నిత్య నూతనంగా ప్రకాశించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, శంకర్, బాలకృష్ణ, పరశురామ్, పూజారి హేమంత్ శర్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News