పేరుకే ప్రజావాణి.. జాడలేని అధికారులు

సైనిక్ పురి జలమండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి అలంకార ప్రాయంగా మారింది.

Update: 2024-10-07 15:20 GMT

దిశ, మల్కాజిగిరి: సైనిక్ పురి జలమండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి అలంకార ప్రాయంగా మారింది. ఆర్భటంగా ప్రజావాణి నిర్వహిస్తున్నామని ప్రకటిస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇందుకు సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాల్సిన అధికారులు 11 గంటల సమయం దాటిన అందుబాటులో లేకపోవటంతో వినియోగదారులు అసహనానికి గురైయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.


Similar News