సమస్యలకు నిలయంగా మారిన మచ్చ బొల్లారం కాలనీలు...

సమస్యలకు నిలయంగా మారిన రాయల్ ఎంక్లేవ్, ధర్మారెడ్డి కాలనీల సమస్యలు పరిష్కారించాలని ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-09-25 16:17 GMT

దిశ, అల్వాల్ : సమస్యలకు నిలయంగా మారిన రాయల్ ఎంక్లేవ్, ధర్మారెడ్డి కాలనీల సమస్యలు పరిష్కారించాలని ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాయల్ ఎంక్లేవ్, ధర్మారెడ్డి కాలనీలోని ఓపెన్ నాలాకు మరమతులు చేసి పై కప్పు స్లాబ్ వేయాలని కాలనీలో చాలా కాలంగా పెండింగ్ లోఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులైన్లు వెంటనే వేయాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని నాలా పై కప్పు వెంటనే వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన చోట సీసీ రోడ్లు, నూతన డ్రైనేజీ లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, నాగిరెడ్డి, మైపాల్ రెడ్డి, చంద్రశేఖర్, అనిల్ రావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News