కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉందాం : ఎమ్మెల్యే

కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-30 14:52 GMT

దిశ, కూకట్​పల్లి : కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్​లు, ముఖ్యనాయకులతో సోమవారం క్యాంప్​ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయా డివిజన్​లలో ప్రజా సమస్యల పై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్​లలో ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉంటే తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కోరారు.

హైడ్రాకి సంబంధించి ప్రజలలో భయం ఏర్పడిందని, హైడ్రా భయాన్ని ప్రజల నుంచి తొలగించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. అదే విధంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా వేడుకలకు ఎక్కడ ఆటంకం కలగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతినిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​లు జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, సబీహ బేగం, పండాల సతీష్ గౌడ్​, మాజీ కార్పొరేటర్​లు తూము శ్రావణ్​ కుమార్​, బాబురావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దిన్​ తదితరులు పాల్గొన్నారు.


Similar News