ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే

ఆలయాల సంరక్షణ కోసం ప్రజలు కూడా ఆలోచన చేయాలని, ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు.

Update: 2024-10-22 14:24 GMT

దిశ, కంటోన్మెంట్ : ఆలయాల సంరక్షణ కోసం ప్రజలు కూడా ఆలోచన చేయాలని, ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. మంగళవారం ముత్యాలమ్మ ఆలయంను సందర్శించిన ఎమ్మెల్యే రాజా సింగ్ స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టకేలకు పోలీస్ లు తనకు ఇక్కడకు రావడానికి అనుమతించారని తెలిపారు.

     ఎవరికి లేని ఆంక్షలు తనకు పెట్టి ఇప్పటికి దర్శించుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఆలయాల వరుస దాడుల వెనుక ఎవరున్నా, ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దని కోరారు. పోలీసులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టొద్దని సూచించారు. పూర్తి విచారణ జరిపిన తరువాత స్టేట్ మెంట్ ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి సూచించారు.

Tags:    

Similar News