ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి: కూకట్​పల్లి ఎమ్మెల్యే

ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే

Update: 2024-10-11 13:28 GMT

దిశ, కూకట్​పల్లి: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్​ డివిజన్​ పరిధిలోని ఇంద్రానగర్​ కాలనీలో తాగునీటి సరఫరాలో సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం కార్పొరేటర్​ ఆవుల రవీందర్​ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇందిరా నగర్​ కాలనీ వాసులకు తాగునీటి సమస్యను లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా కాలనీలో డ్రైనేజ్ సమస్య లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగ ప్రియ తదితరులు పాల్గొన్నారు.


Similar News