అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకుని ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే

అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కిరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-23 14:10 GMT

దిశ, కూకట్​పల్లి : అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కిరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్​ డివిజన్​ పరిధిలోని అవంతినగర్​ తోటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాలనీలో తాగునీటి సమస్య ఎదురవుతుందని, అదే విధంగా డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని అన్నారు. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు, బీఆర్​ఎస్​ నాయకులు సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, సత్యం, తిరుపతి, నరసింహ రెడ్డి, వెంకటేశ్వర్​లు, సుశీలు కుమార్, యాదవ దేవేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News